రాష్ట్ర అధికారప్రతినిధి.రాజేష్ అప్పసాని రాష్ట్రవార్త తెనాలి: కూటమి ప్రభుత్వంలొ పేదలకు పెన్నిధిలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ సమయపాలనతొ లబ్ధిదారులకు చేరుతుందని రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ అప్పసాని పేర్కొన్నారు. ఎన్టీఆర్ బరోసా ఫెంక్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక 23 వ వార్డులో, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ పాల్గొని, లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చేరే విధంగా పంపిణీ చేయడంలో, ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుధ్ధి వ్యక్తమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో టౌన్ టిడిపి అధ్యక్షులు మహ్మద్ కుద్దూస్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిబాబు వేమూరి శేషగిరిరావు, వార్డు మహిళా నాయకురాలు కొండా రమాదేవి, షేక్ నాగూర, వార్డ్ ప్రెసిడెంట హైమారావు, వేములరాజేష్, షేక్ ఖాదర్, గంట రవి కిరణ్,వేముల గోవిందు హంస, విజయ, భాస్కర్, సాయి, చైతన్య,21,22, 23, 24 , 25 వార్డుల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.. 23వార్డులో ఫెంక్షన్ పంపిణీ చేస్తున్న టిడిపి రాష్ట్ర అధికారప్రతినిధి రాజేష్ అప్పసాని, స్ధానిక టిడిపి నాయకులు.